రాష్ట్రీయం

పంచాయతీ రాజ్‌లో 480 పోస్టుల మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 13: పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలోని గ్రామీణ తాగునీరు, సానిటేషన్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రస్తుతం ఉన్న పోస్టులతో పాటు అదనంగా మరో 480 పోస్టులను తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్. శివశంకర్ పేరుతో సోమావారం ఉత్తర్వులు (జీఓ ఎంఎస్ నెంబర్ 26) జారీ అయ్యాయి. ఒక ఇంజనీర్-ఇన్-చీఫ్‌తో పాటు ఒక ఎస్‌ఇ, 22 మంది ఇఇలు, 40 మంది డిఇఇలు, 205 ఎఇఇలు, 68 ఎఇలు, ఒక ఎన్‌టిపిఎ పోస్టు, 22 డివిజన్ అకౌంట్స్ ఆఫీసర్స్, 24 మంది సూపరింటెండెంట్లు, 26 మంది సీనియర్ అసిస్టెంట్లు, 70 మంది జూనియర్ అసిస్టెంట్ల పోస్టులను మంజూరు చేశారు. పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ అవసరమైన ఈ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఈ జీఓలో శివశంకర్ సూచించారు.