రాష్ట్రీయం

హైదరాబాద్‌లో ప్రియాంక గాంధీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 18: ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ కుమారుడు రేహాన్ ఎడమ కంటికి శనివారం హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి డాక్టర్లు చికిత్స చేశారు. శనివారం తెల్లవారు జామున ప్రియాంక, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, కుమారుడు రేహాన్‌తో కలిసి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఇటీవల రేహాన్ క్రికెట్ ఆడుతుండగా కంటికి గాయమైనట్లు సమాచారం. దీంతో ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు చికిత్స చేశారు. అయినప్పటికీ హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో చూపించుకోవాల్సిందిగా సూచించడంతో వారు హుటాహుటిన వచ్చినట్లు తెలిసింది. ఎయిమ్స్ డాక్టర్ల సూచన మేరకే ఎల్వీ ప్రసాద్‌కు వచ్చారా? లేక వారే ఇక్కడికి వచ్చి ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో చూపించి, చికిత్స చేయించారా? స్పష్టంగా తెలియలేదు. భద్రతా కారణాల దృష్ట్యా ఎవరికీ సమాచారం ఇవ్వలేదు. మీడియాను కూడా దూరంగా ఉంచారు. డాక్టర్ల ప్రత్యేక బృందం రేహాన్‌కు చికిత్స చేస్తున్న సమయంలో రాబర్ట్ వాద్రా, ప్రియాంక ఆసుపత్రి ఆవరణలోని గుళ్లపల్లి ప్రతిభారావు బ్లాక్‌లో కూర్చున్నారు. చికిత్స పూర్తయిన అనంతరం మధ్యాహ్నం వారు ఢిల్లీకి తిరిగి వెళ్ళారు. ఇలాఉండగా ప్రియాంక ఆమె భర్త రాబర్ట్ వాద్రా, కుమారుడు రేహాన్ హైదరాబాద్‌కు వచ్చిన విషయం కాంగ్రెస్ నాయకులెవ్వరికీ సమాచారం లేదు. వారు వస్తున్న విషయం బయటకు తెలిస్తే పార్టీ నాయకులు, మీడియా ప్రతినిధులు ఆసుపత్రికి వస్తారన్న ఉద్దేశంతో వారి రాక విషయాన్ని గోప్యంగా ఉంచారు.

కుమారుడితో ప్రియాంక గాంధీ
(ఫైల్ ఫొటో)