రాష్ట్రీయం

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వికె శ్రీనివాసన్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 21: ప్రముఖ ఆర్థికవేత్త, రిటైర్డు ఐఏఎస్ అధికారి వికె శ్రీనివాసన్ (76) గుండె పోటుతో సోమవారం రాత్రి హైదరాబాద్‌లో మరణించారు. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పని చేసారు. 1963 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన శ్రీనివాసన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో రిటైర్ అయ్యారు. కేంద్ర ఆర్థికశాఖలో కూడా కొంతకాలం పని చేశారు. మాజీ ప్రధాన మంత్రి పివి నరసింహారావుకు, ఆర్‌బిఐ మాజీ గవర్నర్ వైవి రెడ్డికి అత్యంత సన్నిహితుడు. హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ డైరెక్టర్‌గా కూడా పని చేశారు. కరీంనగర్, అనంతపూర్ జిల్లాల కలెక్టర్‌గా పని చేశారు. ఆర్థికరంగంలో శ్రీనివాసన్‌కు మంచిపట్టు ఉందని ఆర్‌బిఐ మాజీ గవర్నర్ వైవి రెడ్డి తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.