రాష్ట్రీయం

కురవి దేవుడికి కోర మీసాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 23: శివరాత్రి పర్వదినాన శుక్రవారం ప్రసిద్ధ కురవి వీరభద్రస్వామికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు కోర మీసాలు సమర్పించి మొక్కు తీర్చుకోనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కురవి వీరభద్రస్వామికి కోర మీసాలు సమర్పించుకోనున్నట్టు ముఖ్యమంత్రి మొక్కుకున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడంతో ఇటీవల తిరుపతికి వెళ్లి మొక్కు చెల్లించుకున్న ముఖ్యమంత్రి శివరాత్రి పర్వాదినాన కురవి వెళ్లి మొక్కు తీర్చుకుంటారు. శుక్రవారం ఉదయం 9.15 గంటలకు ముఖ్యమంత్రి కీసర వెళ్లి శ్రీ రామలింగశే్వర స్వామిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి హెలిక్యాప్టర్ ద్వారా 10.15 గంటలకు కురవికి చేరుకుని వీరభద్రస్వామికి మీసాలు సమర్పించి మొక్కు చెల్లించుకుంటారు. వెండి తాపడంతో ఉండే ఈ బంగారు మీసాలు 20.28 గ్రాముల బరువు, రూ.62,908 విలువ చేస్తాయని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.