రాష్ట్రీయం

గ్రూప్-1 ఆఫీసర్ పోస్టుకు సింధు ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 24: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, రియో ఒలంపిక్స్‌లో సిల్వర్ మెడలిస్ట్ పివి సింధు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ ప్రతిపాదనను ఆమోదించినట్టు తెలిపింది. ఒలంపిక్స్‌లో పతకం సాధించిన ఐదో మహిళ అయిన సింధుకు గతంలో 3కోట్ల రూపాయల నగదు పురస్కారాన్ని ఎపి ప్రభుత్వం అందజేసింది. ఆ సందర్భంగానే ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిపాదించారు. గ్రూప్-1 ఆఫీసర్‌గా నియమించేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఇటీవల విజయవాడలో జరిగిన జాతీయ మహిళా సదస్సులో కూడా ఈ అంశాన్ని ఆమె వద్ద ముఖ్యమంత్రి ప్రస్తావించారు. రాజధాని అమరావతిలో పనిచేసేందుకు ఆమె ఆసక్తి కనబర్చినట్టు తెలిసింది. దీంతో ఆమెను గ్రూప్-1 కేటగిరిలో సబ్ కలెక్టర్‌గా నియమించే అవకాశం ఉంది.
ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్టు తెలిసింది. కాగా ప్రస్తుతం ఈమె భారత పెట్రోలియం కార్పొరేషన్‌లో హైదరాబాద్ కార్యాలయంలో అసిస్టెంట్ మేనేజర్ (స్పోర్ట్స్)గా 2013 నుంచి వ్యవహరిస్తున్నారు.