రాష్ట్రీయం

బాబోయ్ ట్రంప్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 6: ‘నాయకత్వం సమర్థంగా ఉండి.. శాంతిభద్రతలు కాపాడినప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుంది. శ్రుతి మించితే అనర్థాలు తప్పవ’ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరించారు. రాష్ట్రంలో కులాలు, మతాల పేరిట చిచ్చు రగులుకుంటున్నందునే శాంతిభద్రతల అంశంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశం అనంతరం సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమెరికాలో ట్రంప్ మాదిరిగా విధాన నిర్ణయాలు తీసుకుంటే అలజడి రేకెత్తుతుందని వ్యాఖ్యానించారు. ప్రపంచానికి నాయకత్వం వహిస్తున్న అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్ విదేశీయులపై చూపుతున్న వివక్ష తిరోగమనానికి నాంది కాగలదన్నారు. అక్కడ ఎవరికీ భద్రత లేదు. ఆ దేశానికి వెళ్లాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. నిత్యం ఏదో రూపంలో దాడులు జరుగుతున్నాయి. నిర్దుష్టమైన లక్ష్యాన్ని చేరుకోవాలటే స్పష్టత, నిబద్ధత, నాయకత్వం ఉండాలని ఉద్ఘాటించారు.