రాష్ట్రీయం
హైకోర్టులో అప్పీలు చేస్తాం: వసంత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 8 March 2017
హైదరాబాద్, మార్చి 7: మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణల కేసులో ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ సాయిబాబాకు యావజ్జీవ శిక్ష విధిస్తూ గడ్చిరొలి కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో అప్పీలు చేస్తామని సాయిబాబా భార్య వసంత తెలిపారు.ఈ కేసులో నిందితులుగా ఉన్న వారందరికీ శిక్ష పడటం తనను దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. న్యాయవ్యవస్థపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వత్తిడి చేసినట్టు కనిపిస్తోందని అన్నారు. కాగా 2014లో ఢిల్లీలోని తన నివాసంలో సాయిబాబాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుపై సుదీర్ఘ విచారణ అనంతరం తాజా తీర్పును ఇచ్చింది.