రాష్ట్రీయం

బడ్జెట్ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 12: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతికి సంతాపసూచకంగా సోమవారం జరగాల్సిన రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలను రద్దుచేశారు. 14న రెండు సభల్లోనూ నాగిరెడ్డి మృతికి సంతాపం తెలియచేస్తారు. అనంతరం ఉభయ సభలు వాయిదా పడతాయని అసెంబ్లీ అధికారులు తెలిపారు. ఈనెల 13న సొంతగడ్డ వెలగపూడిలో నిర్మించిన అసెంబ్లీలో తొలిసారిగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని తొలుత నిర్ణయించారు. ఈమేరకు ఏర్పాట్లు పూర్తిచేశారు. అయితే ఎమ్మెల్యే నాగిరెడ్డి మృతితో శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు, ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఆదివారం అత్యవసరంగా సమావేశమై తాజా పరిస్థితులపై చర్చించారు. సభ్యుని మృతికి సంతాపసూచకంగా సోమవారం నాటి సమావేశాన్ని వాయిదా వేయాలని నిర్ణయించారు. బిజినెస్ అడ్వయిజరీ కమిటీ మంగళవారం సమావేశమై బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు వీలుగా తేదీని, ఇతర అంశాలను ఖరారు చేయాలని కూడా వారు నిర్ణయించారు. దీంతో సోమవారం నాటి బడ్జెట్ సమావేశం వాయిదా పడగా, బుధవారం జరగవచ్చని భావిస్తున్నారు.