రాష్ట్రీయం

రైల్వేజోన్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 16: విశాఖపట్నంలోనే ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ కూడా పూర్తి కావచ్చిందని, త్వరలో ఏపికి 225 శాసనసభ స్థానాలు ప్రకటిస్తారని సిఎం చెప్పారు. కడపలో స్టీల్ ప్లాంట్, దుగ్గరాజపట్నం నౌకాశ్రయాల అడ్డంకులు కూడా తొలగి పోతాయన్నారు. విభజన అనంతరం జాతీయ విద్యాసంస్థల ఏర్పాటు పూర్తికావచ్చిందని, ట్రైబల్, పెట్రోలియం విశ్వ విద్యాలయాలకు త్వరలో క్లియరెన్స్ వస్తుందని చెప్పారు. 2019 నాటికి ఏర్పాటయ్యే 15వ ఆర్థిక సంఘంలో రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు తరలించటంతో పాటు లోటును అధిగమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు.