రాష్ట్రీయం

ట్రెజరీల్లో మూగబోయిన సర్వర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 21: రెండు రోజులుగా నవ్యాంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ట్రెజరీల్లో సర్వర్లు పనిచేయకపోవటంతో ప్రజానీకం ఇబ్బందుల పాలైంది. నిజానికి నాలుగు రోజులుగా తరచూ సర్వర్లు పనిచేయలేదు. అయితే సోమవారం ఉదయం నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు పూర్తిగా పనిచేయలేదు. దీనివల్ల వెబ్ చలానాలు వెళ్లక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇదిలావుంటే, రెండు రోజులుగా ఆర్థిక సంక్షోభం కారణంగా వివిధ రకాల చెల్లింపులు కూడా నిలిచిపోయాయి. మార్చి మాసాంతం కావటంతో ట్రెజరీ సర్వర్‌పై ఒత్తిడి పెరిగి ఇబ్బందులకు గురైన మాట వాస్తవమేనని ట్రెజరీ డైరెక్టర్ కనకవల్లి ‘ఆంధ్రభూమి’ ప్రతినిధికి తెలిపారు. అయనప్పటికీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రతి నిమిషం అప్రమత్తంగా వ్యవహరిస్తామని ఆమె చెప్పారు.