రాష్ట్రీయం

భద్రాద్రి రామయ్యకు బంగారు కిరీటం బహూకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, మార్చి 23: దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామికి రూ.10 లక్షల వ్యయంతో తయారు చేయించిన బంగారు కిరీటాన్ని ఓంకారేశ్వర పీఠాధిపతి ప్రతాప దక్షిణామూర్తి, జగిత్యాల జిల్లా కలెక్టర్ ఎ శరత్ బుధవారం సమర్పించారు.
భద్రాచలం దేవస్థానాన్ని వారు గురువారం దర్శించుకుని గర్భగుడిలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం వజ్రాలు, ముత్యాలు పొదిగిన కిరీటాన్ని స్వామివారికి బహూకరించారు. ఈసందర్భంగా ఆలయ ఇవో రమేష్‌బాబు పీఠాధిపతికి, కలెక్టర్ దంపతులకు జ్ఞాపిక అందజేశారు.

చిత్రం..రామయ్యకు బహూకరించిన బంగారు కిరీటం