రాష్ట్రీయం

తల్లి, ఏడేళ్ల కొడుకు హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీరాల/ పర్చూరు, మార్చి24: అమెరికాలో నివసిస్తున్న ఓ తెలుగు కుటుంబంలో దారుణం చోటు చేసుకుంది. న్యూజెర్సీలోని మ్యాపుల్‌సెట్‌లో నివాసం ఉంటున్న తల్లీ కుమారులు శశికళ (37), ఏడేళ్ల అనీశ్ సాయి ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. వీరి స్వస్థలం ప్రకాశం జిల్లా పరుచూరు మండలం తిమ్మరాజుపాలెం గ్రామం. గుర్తు తెలియని దుండగులు వారిని గొంతు కోసి హతమార్చారు. శశికళ భర్త నర్రా హనుమంతరావు సిటిఎస్ కంపెనీలో అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. శశికళ కూడా ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీకి ఇంటినుంచే సేవలు అందిస్తున్నారు. మధ్యాహ్నం కుమారుణ్ని స్కూలునుంచి శశికళ ఇంటికి తీసుకురావడాన్ని ఇరుగు పొరుగు వారు గమనించినట్టుగా చెబుతున్నారు. ఆ తరవాత ఇంటికి ఎవరు వచ్చిందీ పోలీసులు కూపీ లాగుతున్నారు. కాగా తాను సాయంత్రం ఏడు గంటల సమయంలో ఇంటికి వచ్చి చూసేసరికి భార్య, కొడుకు రక్తపు మడుగులో పడి ఉన్నారని హనుమంతరావు పోలీసులకు తెలిపారు. ఆయన కుటుంబం గత పదేళ్లుగా మ్యాపుల్‌సెట్‌లో నివాసముంటున్నారు. తిమ్మరాజుపాలేనికి చెందిన హనుమంతరావు, విజయవాడకు చెందిన శశికళలది ప్రేమ వివాహం. విజయవాడ శివార్లలోని లక్ష్మీపురం తాడిగడపలో నివాసముంటున్న శశికళ తల్లిదండ్రులు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ అల్లుడే తమ కుమార్తెనూ, మనవణ్నీ దారుణంగా చంపి ఉంటాడని ఆరోపించారు. కొనే్నళ్లుగా తమ అమ్మాయిని వేధింపులకు గురి చేస్తున్నాడని, మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడంటూ తమ కుమార్తె ఎన్నోసార్లు తమతో మొర పెట్టుకుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తిమ్మరాజుపాలెంలో ఉంటున్న హనుమంతరావు తల్లిదండ్రులు ఈ ఆరోపణల్ని తోసిపుచ్చారు. తమ కుమారుణ్ని పోలీసులు విచారించిన అనంతరం వదిలిపెట్టారని వారు చెబుతున్నారు. ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుశశికళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి పరామర్శించారు. విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానని ఆయన చెప్పారు.