రాష్ట్రీయం

రెండు నెలలు భగభగలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, భద్రాచలంలో శుక్రవారం గరిష్టంగా 40 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. మెదక్, నిజామాబాద్ 39, హైదరాబాద్, ఖమ్మం, నల్గొండలో 38 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు రానున్న వారంలో మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ అంచనా. రాష్ట్రంలోని 17 జిల్లాల్లో 40 డిగ్రీలకు, మరో 14 జిల్లాల్లో 42 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కొమరంభీం- ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్- భూపాలపల్లి, భద్రాద్రి- కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగులాంబ- గద్వాల్ జిల్లాల్లో 37 డిగ్రీల నుంచి 42 డిగ్రీలకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు.