రాష్ట్రీయం

అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ ఆస్తుల వేలానికి పచ్చజెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 27: అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ ఆస్తుల వేలానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ రెండు కంపెనీలకు చెందిన 17 ఆస్తులను ఇ-పోర్టల్ ద్వారా వేలం వేయాలని హైకోర్టు ధర్మాసనం గురువారం ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ వి రామసుబ్రహ్మణియన్, జస్టిస్ ఎస్‌వి భట్‌తో కూడిన ధర్మాసన ఈ కేసును విచారించింది. అగ్రిగోల్డ్‌కు చెందిన 12 ఆస్తులు, అక్షయ గోల్డ్‌కు చెందిన ఐదు ఆస్తులను ఈ పోర్టల్‌లో ఉంచాలని ఆదేశించింది. ఈ ఆస్తుల వేలానికి సంబంధించి మార్గదర్శకాలను శుక్రవారం జారీ చేస్తామని హైకోర్టు పేర్కొంది.