రాష్ట్రీయం

బ్యాంక్‌కు రూ.3కోట్ల టోకరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, మే 12: నగరంలోని ఓ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ను కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి సుమా రు రూ.3కోట్ల మేర మోసం చేసిన సంఘటన ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది. స్థానిక ఏకె నగర్‌లో ఉన్న ఓ ప్రభుత్వ రంగ బ్యాంక్‌లో తనఖా నిమిత్తం వచ్చే బం గారు ఆభరణాలను పరీక్షించి, విలువ లెక్కగట్టే అప్రయిజర్ మరికొందరు కలిసి ఒక బృందంగా ఏర్పడి బ్యాంక్‌ను మోసం చేయడం ప్రారంభించారు. తక్కువ నాణ్యత కలిగిన బంగారాన్ని నాణ్యత కలిగిన మేలిమి బంగారంగా పరీక్షల నిర్ధారణ చేసి బ్యాంక్ నుండి రుణాలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఈ తంతు చాలాకాలంగా నిరాటంకంగా కొనసాగుతూ వచ్చింది. ఇటీవల బ్యాంక్‌లో జరిగిన తనిఖీల్లో బం గా రం నకిలీదని తేలడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు బ్యాంక్ అధికారులు సంబంధిత వ్యక్తులపై స్థానిక 5వ నగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసును దర్యాప్తు చేపట్టారు.