రాష్ట్రీయం
రైతులకు బేడీలపై హెచ్ఆర్సి సీరియస్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 13 May 2017
ఖమ్మం, మే 12: రైతులకు బేడీలు వేసి న్యాయస్థానానికి తీసుకురావడంపై మానవ హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. టిడిపి లీగల్సెల్కు చెందిన న్యాయవాది రజనీకాంత్రెడ్డి ఖమ్మం ఘటనపై హెచ్ఆర్సిని ఆశ్రయించగా నాటి సంఘటనపై పూర్తి వివరాలతో వచ్చే నెల 5వ తేదీలోగా నివేదిక సమర్పించాలని నగర పోలీస్ కమిషనర్ తఫ్సీర్ఇక్బాల్ను ఆదేశించింది. కాగా రైతులకు బేడీలు వేయడం మానవ హక్కుల ఉల్లంఘనేనని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన హెచ్ఆర్సిని కోరారు. ఇదే క్రమంలో సంఘటనను పక్కదారి పట్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని కూడా ఆయన హెచ్ఆర్సికి తెలిపారు. దీనిపై ఉన్నత న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించనున్నట్లు టిడిపి నేతలు వెల్లడించారు.