రాష్ట్రీయం
సైబర్ సెక్యూరిటీ పటిష్టంగా ఉంది
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 14 May 2017
హైదరాబాద్, మే 13: తెలంగాణలో ప్రభుత్వ సమాచార టెక్నాలజీ వ్యవస్ధ, వెబ్సైట్లు హ్యాకింగ్ కాలేదని హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. తమ వ్యవస్థ మొత్తం నేషనల్ ఇన్ఫర్మేటింగ్ సెంటర్తో అనుసంధానమై పటిష్టమైన సైబర్ భద్రత కలిగి ఉండటం వల్ల హ్యాక్ చేయడం అసాధ్యమన్నారు. పోలీసు శాఖతో పాటు అన్ని శాఖలు ముందస్తు చర్యలు తీసుకున్నాయన్నారు. తమకు ఇంతవరకు హ్యాకింగ్పై ఫిర్యాదులు అందలేదంటూనే, తెలంగాణ ఐటి వ్యవస్ధ హ్యాకింగ్కు గురయ్యే అవకాశాలు లేవన్నారు. మొదటి నుంచి దీనిపై శ్రద్ధ పెట్టడం, సైబర్ సెక్యూరిటీపై శిక్షణ ఇవ్వడం, ముందస్తు చర్యల వల్ల హ్యాకింగ్ భయాలు తమకు లేవన్నారు.