రాష్ట్రీయం

ఎన్టీఆర్‌కు అసలైన వారసులం మేమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మే 13: ప్రజలందరికీ న్యాయం చేయడం కోసం తాము ప్రయత్నిస్తున్నామని, ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన వారసులం తామేనని తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం ఖమ్మంలో విలేఖరులతో మాట్లాడుతూ పార్టీని భ్రష్టుపట్టించిన నేతలు, తనను ఓడించేందుకు కుట్రపన్నిన నాయకులు ఇప్పుడు ఏదో చేస్తామని ప్రజలకు మాయమాటలు చెబుతున్నారన్నారు. ఖమ్మం మార్కెట్ ఘటనలో కొందరు అమాయక రైతులు అరెస్టు కావడం విచారకరమని, దానిని రాద్ధాంతం చేస్తూ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులపైన, మంత్రులపైన ఆరోపణలు గుప్పించడం బాధాకరమన్నారు. కుట్ర రాజకీయాలు చేస్తే తరిమికొట్టేందుకు వెనకాడమని హెచ్చరించారు. కొందరు వ్యాపారుల వల్ల రైతులు నష్టపోయిన మాట వాస్తవమేనని, రైతులను కాపాడుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదన్నారు.

చిత్రం..మంత్రి తుమ్మల నాగేశ్వరరావు