రాష్ట్రీయం

టెక్నాలజీతో నీళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మే 14: గ్రామాల్లో మంచినీటి సమస్యపై వస్తున్న ఫిర్యాదుల పరిష్కారం కోసం ఐటి, పంచాయతీరాజ్ మంత్రి లోకేష్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నారు. దీనికోసం రియల్ టైం వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. మంచినీటి సమస్యలపై వివిధ పత్రికలు, వార్త్ఛానళ్లలో వస్తున్న కథనాలను కూడా ఫిర్యాదులుగా స్వీకరించి ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్నారు. జిల్లాల్లో మంచినీటి సమస్య నెలకొన్న ప్రాంతాల నుంచి నేరుగా ఫొటోలు రప్పించుకోవటం ద్వారా సమస్యను పరిష్కరించే పద్ధతికి శ్రీకారం చుట్టారు. గ్రామాల్లో నీటి సమస్యను పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం, సంప్రదాయ మాధ్యమాలు, అధునాతన ఎఎంఎస్ అలర్ట్ మేనేజ్‌మెంట్‌ను ఉపయోగించి పైలట్ ప్రోగ్రాంను ప్రారంభించారు. విజయవాడకు సమీపంలోని ఇబ్రహీంపట్నంలోనే ఈ కాల్ సెంటర్‌ను ఈ నెల 19న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఎఎంఎస్ అలర్ట్ మేనేజ్‌మెంట్, జిపిఎస్ టెక్నాలజీని ఉపయోగించి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. అధునాతన కాల్ సెంటర్ ఏర్పాటు చేసి ట్రయల్ రన్‌ను విజయవంతంగా పూర్తిచేశారు. ముందుగా కరవు జిల్లాల్లో కాల్ సెంటర్ ట్రయల్ రన్‌ను ప్రారంభించారు. సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, జెడ్పీటిసిలకు ‘మీ గ్రామాల్లో నీటి సమస్య ఉంటే కాల్ సెంటర్ నెంబర్‌కు ఫోన్ చెయ్యండి’ అంటూ మెసేజ్‌లు పంపారు. ఆ తరువాత ట్రయల్ రన్‌ను రాష్టవ్య్రాప్తంగా నిర్వహించారు. అన్ని జిల్లాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, జెడ్పీటిసిల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సమస్యల పరిష్కారం కోసం సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారు. ఒక గ్రామంలో మంచినీటి సమస్య ఉందని కాల్ సెంటర్‌కు ఫిర్యాదు రాగానే ఎఎంఎస్ అలర్ట్ మేనేజ్‌మెంట్ ద్వారా కిందిస్థాయి అధికారికి, సంబంధిత పైస్థాయి అధికారికి సమాచారం చేరుతుంది. కిందిస్థాయి అధికారి సమస్యను పరిష్కరించిన తరువాత రిపోర్ట్‌ను, సంబంధిత ఫొటోను పైస్థాయి అధికారికి పంపించాల్సి ఉంటుంది. ప్రతిరోజూ గ్రామాల్లో సరఫరా అవుతున్న నీటి ట్యాంకర్లు పక్కదారి పట్టకుండా జిపిఎస్ ట్రాకింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. నిధుల కొరత ఉందని తెలియగానే కరవు మండలాలకు రూ. 2లక్షలు, మిగిలిన మండలాలకు రూ. లక్ష చొప్పున అత్యవసర నిధులు కేటాయించారు. ఇప్పటివరకు పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా 707 ఫిర్యాదులు స్వీకరించారు. ఇక జిల్లాల నుండి కాల్ సెంటర్‌కు 2576 ఫిర్యాదులు అందాయి. అందులో 1067 సమస్యలు పరిష్కరించారు. ఇప్పటివరకూ కాల్ సెంటర్ ద్వారా పరిష్కారమైన సమస్యలపై ప్రజల నుండి ఐవిఆర్‌ఎస్ ద్వారా అభిప్రాయాలు సేకరించారు. ప్రజాభిప్రాయ సేకరణలో 77 శాతం మంది సమస్య పరిష్కారమైందని, 23 శాతం మంది సమస్య పరిష్కారంలో ఆలస్యమైందని అభిప్రాయపడ్డారు.
గ్రామాల్లో నీటి సమస్యకు సంబంధించి సోషల్ మీడియాలో ఫొటోలతోసహా వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా అధికారులను లోకేష్ పరుగులు పెట్టిస్తున్నారు. ట్విట్టర్, ఫేస్‌బుక్ ద్వారా గ్రామాల్లో ఉన్న నీటి సమస్య గురించి నేరుగా ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఇప్పటివరకూ ఆయనకు సామాజిక మాధ్యమాల ద్వారా దాదాపుగా 1000 ఫిర్యాదులు అందాయి. అందులో 300 సమస్యలను పరిష్కరించారు. మిగిలిన ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇటీవల తమ గ్రామానికి మంచినీరు అందడం లేదంటూ ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పాతపాడు గ్రామస్తులు పడుతున్న కష్టాలను ట్విట్టర్ ద్వారా రమణ అనే వ్యక్తి మంత్రి లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన మంత్రి పాతపాడు వాసులకు మంచినీరు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికారులు యుద్ధప్రాతిపదికన గ్రామానికి మంచినీరు అందించారు.