రాష్ట్రీయం

నాలుగు రోజులు మండే ఎండలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 14: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వచ్చే మూడు, నాలుగు రోజుల్లో సాధారణం కంటే మూడు, నాలుగు డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తాయని, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. ఇస్రో జారీ చేసిన హెచ్చరికను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర విపత్తు నివారణ సంస్థ ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో సాధారణం కంటే మూడు నాలుగు డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఇలా ఉండగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో వచ్చే రెండురోజుల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండి ప్రకటించింది.