రాష్ట్రీయం

అమెరికాలో వడమాలపేట విద్యార్థి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 14: చిత్తూరు జిల్లా వడమాలపేట మం డలం పి బొమ్మరాజపురానికి చెందిన అడ్లూరు చంద్రశేఖర్‌రాజు, సుహాసినిల దంపతుల రెండవ కుమారుడు అడ్లూరు సాయికుమార్ (23) అమెరికాలోని ఇల్లినాయి స్ రాష్ట్రం డెక్లాంబ్ సిటీలో శనివారం రాత్రి 10 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. బంధువుల సమాచారం మేరకు డెక్లాంబ్ సిటీ లో ఇల్లీనాయిస్ యూనివర్శిటీలో సాయికుమార్ ఎమ్మెస్ చదువుతున్నారు. శనివారం రాత్రి తన స్నేహితుడి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం తన కారులో బయలుదేరారు. మరో ఐదు కిలోమీటర్ల దూరంలో సాయికుమార్ యూనివర్శిటీకి చేరుకునే సమయంలో వెనుకనుంచి ఓకారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డ సాయికుమార్ మృతి చెందారు. ఈసమాచారం ఆదివా రం మధ్యాహ్నం తల్లిదండ్రులకు చేరడంతో వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. మూడు మాసాల్లో ఎమ్మెస్ పూర్తిచేసుకుని స్వదేశానికి వస్తాడని ఎదురుచూస్తున్న సాయికుమార్ కుటుంబానికి తీరని కడుపుకోత మిగిల్చింది. ఈ విషాదంతో బంధువులు కుప్పకూలిపోయారు. ఈవిషయాన్ని ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమనాయుడుకు కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఆయన ఈ విషయా న్ని సిఎం దృష్టికి తీసుకెళ్లి సాయకుమా ర్ మృతదేహం స్వగ్రామం చేరుకోవడానికి అధికారుల ను సంప్రదించినట్లు సమాచారం. మరో మూడు మాసాల్లో తిరిగి వస్తాడని ఎదురుచూస్తున్న సాయికుమార్ తల్లిదండ్రలకు కడుపుకోత మిగలడం తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు.