రాష్ట్రీయం

నేడు అసెంబ్లీ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 15: దేశం అంతటా ఒకే పన్నుల విధానం అమలుల్లోకి తీసుకువచ్చే చర్యల్లో భాగంగా పార్లమెంట్ ఆమోదించిన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో చర్చించనున్నారు. ఈ బిల్లుపై చర్చించి, అమోదించేందుకు ప్రత్యేకంగా రాష్ట్ర అసెంబ్లీ, శాసన మండలి మంగళవారం సమావేశం కానున్నాయి. జిఎస్‌టికి సంబంధించిన నాలుగు అంశాలపై చర్చిస్తారు. ఉదయం 9.45 గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానుంది. అంతకుముందు బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం కానుంది. అలాగే అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలన్న అంశంపై కూడా చర్చిస్తారు. ఒక్కరోజుతోనే ఈ సమావేశాన్ని ముగిం చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.