రాష్ట్రీయం

బద్‌నామ్ చేయాలనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: ఇందిరాపార్క్ వద్దనున్న ధర్నా చౌక్ తరలింపు చిన్న విషయమే అయినా, ప్రభుత్వాన్ని బదనామ్ చేయడమే పనిగా పెట్టుకొని ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా వామపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని సిఎం కెసిఆర్ గవర్నర్ నరసింహన్‌కు వివరించారు. వాస్తవానికి ధర్నా చౌక్‌ను అక్కడి నుంచి తరలించాలన్న ఆలోచన ప్రభుత్వానిది కాదని, స్థానికులు, వాకర్స్ అసోసియేషన్స్ కోర్టుకు వెళ్లగా ప్రత్యామ్నాయ స్థలాలను ఎంపిక చేయనున్నట్టు పోలీసులు కోర్టుకు చెప్పారన్నారు. ధర్నా చౌక్ తరలింపునకు అనుకూలంగా, ప్రతికూలంగా జరిగిన ఉద్రిక్తత పరిస్థితులపై రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు సిఎం వివరించారు. వారం రోజుల ఢిల్లీ పర్యటన విశేషాలనూ వివరించారు. గవర్నర్ పదవీకాలం పొడిగించడం పట్ల సిఎం కెసిఆర్ బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.