రాష్ట్రీయం

చాన్స్ దక్కేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 10: ఎన్నికల కేబినెట్ విస్తరణలోనైనా తమకు స్థానం దొరుకుతుందేమోనని పలువురు తెరాస ఎమ్మెల్యేలు ఆశగా ఎదురు చూస్తున్నారు. సాధారణ ఎన్నికలకు ఇంకా 21 నెలల గడువుంది. మూడేళ్ల క్రితం ఏర్పడిన మంత్రివర్గంలో పెద్దగా మార్పులు లేకుండా కొనసాగిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్యను తొలగించి కడియం శ్రీహరికి ఆ స్థానమివ్వడం మినహా ఎలాంటి మార్పులూ లేవు. శాఖల్లో మార్పులు తప్ప మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగలేదు. ఇప్పుడున్న మంత్రివర్గంతోనే ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని, ఎన్నికలనాటికి ఎలక్షన్ కేబినెట్ వస్తుందని ముఖ్యమంత్రి సన్నిహితులు చెబుతున్నారు. అయితే సిఎం మాత్రం మంత్రివర్గంలో మార్పులపై ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదు. పైగా ఏపీ మంత్రివర్గంలో మార్పులు చేసి తల నొప్పి కొని తెచ్చుకున్నారంటూ విలేఖరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా లేరు. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులు విమర్శించేందుకు ఇదో అవకాశంగా మారుతుందని, ఆ అవకాశం ఇవ్వకుండా ఎలక్షన్ కేబినెట్‌లో మహిళలకు అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గంలో నిర్ణయాలు, పార్టీపరంగా నిర్ణయాలు, అభ్యర్థుల ఎంపిక అంతా కెసిఆర్ కనుసన్నల్లోనే జరుగుతుందని, ఓటర్లు సైతం కెసిఆర్‌ను చూసే ఓటు వేస్తారని పార్టీ నేతలు నమ్ముతున్నారు. మూడేళ్ల నుంచి ఏ ఎన్నిక జరిగినా టిఆర్‌ఎస్‌కే ప్రజలు ఘన విజయం చేకూరుస్తున్నారు, ప్రభుత్వం తమ కోసం ఎలా పని చేస్తుందని ప్రజలు చూస్తారు అంతే తప్ప మంత్రివర్గం కూర్పు చేర్పులను బట్టి కాదని పార్టీ నాయకులు చెబుతున్నారు.
త్వరలోనే కొందరికి మంత్రి పదవులు లభిస్తాయనే అభిప్రాయం కలిగేట్టుగా ముఖ్యమంత్రి మూడేళ్ల క్రితం పలు సందర్భాల్లో మాట్లాడినా ఇప్పటి వరకు ఆశావాహుల కోరిక తీరలేదు. తెలంగాణ ఏర్పడిన తరువాత ఉద్యోగ సంఘాల నాయకుల సమావేశంలో కెసిఆర్ ఉద్యోగ సంఘాల నాయకుల నుంచి ఒకరిని క్యాబినెట్‌లోకి తీసుకుంటాను అని ముఖ్యమంత్రి బహిరంగంగా చెప్పగా, ఒకరు కాదు ఇద్దరినీ అని నాయకులు కోరారు. సరే అని ముఖ్యమంత్రి చెప్పారు. ఎమ్మెల్సీ స్వామిగౌడ్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌లు మంత్రివర్గంలో తమకు స్థానం ఖాయం అని భావించారు. స్వామిగౌడ్ మండలి చైర్మన్ అయ్యారు. ఎంపి జితెందర్‌రెడ్డి వల్లనే తనకు మంత్రివర్గంలో స్థానం లభించలేదనే శ్రీనివాస్ గౌడ్ పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. కొప్పుల ఈశ్వర్ స్పీకర్ పదవి వద్దు మంత్రివర్గం చేరుతాను అని ఆసక్తి చూపించారు. తరువాత అవకాశం ఉంటుందని హామీ ఇచ్చినా చీఫ్‌విప్ పదవితోనే సరిపెట్టుకున్నారు. రసమయి బాలకృష్ణకు సైతం మంత్రివర్గంలో చోటు అనే హామీ లభించింది. ఎలక్షన్ క్యాబినెట్ కోసం చాలా మంది ఎమ్మెల్యేలు ఆశగా ఎదురు చూస్తున్నారు.