రాష్ట్రీయం

దక్కదని చంపేశాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, జూన్ 10: ప్రేమించాడు.. పెళ్లి చేసుకోమన్నాడు.. ఆమె కాదంది. పెద్దలు కుదిర్చిన సంబంధాన్ని చేసుకోవటానికి సిద్ధపడింది. ఒక్కసారిగా అతనిలో ఉన్మాది నిద్రలేచాడు. తనకు దక్కనిది ఎవరికీ దక్కకూడదనుకున్నాడు. విచక్షణ కోల్పోయాడు. కత్తితో ప్రియురాలిపై దాడిచేసాడు. ఎక్కడపడితే అక్కడ పోట్లు పొడిచాడు.. అతని పైశాచికత్వానికి ఆమె బలైపోయింది. అతను తాపీగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట సమీపంలో శనివారం జరిగిన ఈ ఘటన రాష్టమ్రంతటా సంచలనం రేపింది. మిట్టమధ్యాహ్నం ఇంట్లో ఎవ్వరూ లేని సమయం చూసి ఇంట్లోకి చొరబడి సూదగాని గాయత్రి (22) అనే యువతిపై గోరికంటి శ్రీకాంత్(23) అనే వ్యక్తి విచక్షణారహితంగా కత్తితోదాడి చేసి పరారైనాడు. అరుపులు విన్న ఇంటి ప్రక్కల వారు, స్థానికులు హుటాహుటిన భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందిందని ఎస్సై ప్రభాకర్ తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని యాదగిరిపల్లి గ్రామంలో యువతిని కత్తితో పొడవటంతో ఆమె మృతి చెందింది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యాదగిరిపల్లికి చెందిన సూదగాని గాయత్రి డిగ్రీ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన గోరుకంటి శ్రీకాంత్ కూలీ పని చేసుకుంటున్నాడు. ప్రేమిస్తున్నానని పెండ్లి చేసుకుంటానని గాయత్రిని నిత్యం వేధించేవాడు. గాయత్రి తండ్రి సాయిలు గ్రామంలోని పెద్దమనుషులను పిలిపించి మాట్లాడి గాయత్రి తెరువు రావద్దని హెచ్చరించారు. దీంతో కొంతకాలం వేచి చూసిన శ్రీకాంత్ మళ్లీ పెళ్లి పేరుతో అమ్మాయిని వేధించటం మొదలుపెట్టాడు. ఈ బాధ భరించలేక తల్లిదండ్రులు తమ కూతురికి వివాహం చేయాలని నిశ్చయించారు. నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. ఆగస్టులో అమ్మాయి పెళ్లి ఖాయమైంది. ఈ విషయం తెలుసుకున్న శ్రీకాంత్ అమ్మాయిని మరింతగా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. శనివారం ఇంట్లో ఎవ్వరు లేని సమయం చూసి ఇంట్లోకి వెళ్లి అమ్మాయిని విచక్షణరహితంగా పొడిచి పారిపోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. హత్య చేసిన యువకుడు పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగి పోయినట్లు సమాచారం. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై ప్రభాకర్ తెలిపారు.

చిత్రాలు.. మృత్యువాతపడిన గాయత్రి. హంతకుడు శ్రీకాంత్