రాష్ట్రీయం

తెలుగు చిత్ర సీమకు దాసరి సేవలు చిరస్మరణీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11: తెలుగు చిత్ర సీమకు దాసరి నారాయణ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు. చిత్ర రంగానికి ఆయన లేని లోటు భర్తీ చేయలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యూజిలాండ్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన జగన్ ఆదివారం నాడిక్కడ ఇమేజ్ గార్డెన్స్‌లో జరిగిన దాసరి సంస్మరణ సభలో పాల్గొని దాసరి విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ దాసరి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతినీ, సంతాపాన్ని వ్యక్తం చేశారు. సినీ రంగానికే కాకుండా రాజకీయ, పత్రికా రంగంలో తనదైన సేవలందించారని గుర్తు చేసుకున్నారు.
జగన్ కుటుంబానికి ఘనస్వాగతం
న్యూజిలాండ్ పర్యటన నుంచి తిరిగి విచ్చేసిన వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, ఆయన భార్య భారతిరెడ్డిలకు వైఎస్‌ఆర్‌సిపి నాయకులు, కార్యకర్తలు శంషాబాద్ విమానాశ్రయం వద్ద శనివారం రాత్రి ఘనస్వాగతం పలికారు. పార్టీ నేతలు ప్రతాప్‌రెడ్డి, సైకం శ్రీనివాస్‌రెడ్డి, బసిరెడ్డి సిద్ధారెడ్డి, రామయ్య, గుడివాడ అమర్‌నాథ్, తదితరులు ఘనస్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

చిత్రం.దాసరి విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న వైఎస్ జగన్