రాష్ట్రీయం

విషమిచ్చి చంపేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామర్లకోట, జూన్ 23: తల్లిదండ్రులే ఇద్దరు కుమార్తెలకు కూల్‌డ్రింకులో విషంకలిపి తాగించి కడతేర్చిన విషాద ఘటన తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో శుక్రవారం వెలుగుచూసింది. విజయనగరం జిల్లా పార్వతీపురం సమీపంలోని బెల్గాం ప్రాంతానికి చెందిన కోడూరి సత్యనారాయణ విశాఖపట్నంలోని పెద వాల్తేరులో సెలూన్ షాపు నిర్వహిస్తున్నాడు. భార్య గౌరీశ్వరమ్మ, ఇద్దరు కుమార్తెలు శిరీష (2వ తరగతి), అనూషా (ఎల్‌కెజి)తో కలిసి అక్కడే నివసించేవాడు. 12 రోజుల క్రితం పుణ్య క్షేత్రాలకని బంధువులకు చెప్పి బయలుదేరాడు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు సామర్లకోట రైల్వే స్టేషన్ ఓవర్‌బ్రిడ్జి సమీపంలోని లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నాడు. తరువాత పిల్లలను లాడ్జి గదిలోనే వదిలేసి రాత్రి 7 గంటల సమయంలో భార్యను తీసుకుని సత్యనారాయణ వెళ్లిపోయాడు. శుక్రవారం మధ్యాహ్నమైనా లాడ్జి గది తలుపులు తెరుచుకోకపోవడంతో అనుమానించిన లాడ్జి గుమాస్తా కిటీకిలో నుండి చూడగా ఇద్దరు బాలికలు రెండు మంచాలపై వెల్లకిలా పడుకుని కనిపించారు. అనుమానంతో తలుపు తాళం పగలగొట్టి చూడగా శిరిష, అనూషా చనిపోయివున్నారు. వారి నోటి నుండి నురగలు వచ్చి ఉండటం, పక్కన కూల్‌డ్రింకు బాటిల్ ఉండటంతో విషం కలిపిన కూల్‌డ్రింకు తాగించారని భావిస్తున్నారు.
ఇదిలావుండగా పిల్లలకు విషమిచ్చి పరారైన సత్యనారాయణ, గౌరీశ్వరమ్మ శుక్రవారం ఉదయం 9.30 గంటలకు విశాఖపట్నంలోని తోడల్లుడు సతీష్‌కు ఫోన్‌చేసి, కుటుంబ ఇబ్బందుల కారణంగా తాము ఇద్దరు పిల్లలతో కలిసి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డామని, అయితే పిల్లలు ఇద్దరు చనిపోగా, తమకు వాంతులు కావడంతో బయటకు వచ్చేశామని తెలిపారు. ప్రస్తుతం తాము సికింద్రాబాద్‌లో ఉన్నామని తాము త్వరలో చనిపోతామని సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సతీష్ తదితర బంధువులు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు సామర్లకోట లాడ్జి వద్దకు చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పెద్దాపురం సిఐ ఎస్ ప్రసన్న వీరయ్యగౌడ్, సామర్లకోట ఎస్సై ఎల్ శ్రీనువాసు నాయక్ సంఘటనాస్థలాన్ని సందర్శించారు. మృతదేహాలను పంచానామ అనంతరం పోస్టుమార్టం కొరకు పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సత్యనారాయణ దంపతులపై హత్యానేరం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెద్దాపురం సిఐ ఎస్ ప్రసన్న వీరయ్య గౌడ్ చెప్పారు.

చిత్రం.. లాడ్జి గదిలో మృతి చెందిన అక్కాచెల్లెళ్లు