రాష్ట్రీయం

ఓటుకు ఐదు వేలు ఇస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: ఓటుకు ఐదు వేల రూపాయలు ఇవ్వగలనన్న ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి జైలుకు పంపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో తెలంగాణలో ఓటు కోసం ఒక ఎమ్మెల్సీకి ఐదు కోట్ల రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఓటర్లకు ఐదు వేల రూపాయల చొప్పున ఇవ్వగలనని అనడం దారుణమని భూమన శుక్రవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. ప్రజలు అమ్ముడుపోతారన్న భావనతో చంద్రబాబు మాట్లాడారని ఆయన ధ్వజమెత్తారు. ప్రజలను చులకన చేసి మాట్లాడడం భావ్యం కాదని ఆయన తెలిపారు.