రాష్ట్రీయం

శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం సిజె జస్టిస్ ఖేహర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 25: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీష్ సింగ్ ఖేహర్ కుటుంబ సమేతంగా ఆదివారం తెల్లవారుజామున తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి జరిగిన సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుపతికి చేరుకుని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టిటిడి ఇఓ అనిల్‌కుమార్ సింఘాల్, జెఇఓ శ్రీనివాసరాజు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం శ్రీకాళహస్తికి చేరుకున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీష్ సింగ్ ఖేహర్ ముక్కంటీశ్వరుడ్ని, బ్రమరాంబలను దర్శించుకున్నారు.
శ్రీవారిని దర్శించుకున్న శ్రీదేవి దంపతులు
అతిలోక సుందరిగా అన్ని భాషల్లో కీర్తి గడించిన ప్రముఖ సినీనటి శ్రీదేవి, ఆమె భర్త బోనీకపూర్‌లు ఆదివారం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. దర్శనానంతరం ఆలయం వెలుపలకు వచ్చిన శ్రీదేవిని చూడటానికి అభిమానులు ఎనలేని ఆసక్తి చూపించారు.