రాష్ట్రీయం

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూన్ 25: నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నిజామాబాద్ పోలీసులు చాకచాక్యంగా పట్టుకున్నారు. ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఐదుగురు సభ్యులు ముఠాగా ఏర్పడి సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి భారీ ఎత్తున దొంగతనాలకు పాల్పడడం, సొత్తును తస్కరించిన మీదట దర్జాగా కారులో పారిపోయేవారని నిర్ధారణ అయింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్‌నగర్ ప్రాంతంలో పక్షం రోజుల క్రితం ఓ ఇంట్లో చొరబడి సుమారు 3లక్షల సొత్తును చోరీ చేసింది ఈ ముఠాయేనని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆదివారం కమిషనరేట్ కార్యాలయంలో పట్టుబడ్డ ముఠా వివరాలను కమిషనర్ కార్తికేయ వెల్లడించారు.