రాష్ట్రీయం

నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 26: నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని తెలంగాణ తెలుగు దేశం పార్టీ నిర్ణయించింది. టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు జూబ్లీహిల్స్‌లోని తన నూతన నివాసానికి టి.టిడిపి నేతలను అల్పాహార విందుకు ఆహ్వానించారు.
అనంతరం చంద్రబాబు వారితో మంతనాలు జరిపారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన కార్యక్రమాల గురించి, తాజా రాజకీయ పరిస్థితుల గురించి చర్చించారు. భూ కుంభకోణాలపై పార్టీ స్పందించిన తీరు బాగుందని బాబు వారిని అభినందించారు. తెలంగాణలో పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి వారు చర్చించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు వీలుగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర కమిటీ వరకూ పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని వారు చంద్రబాబుకు వివరించారు. దీనిపై ప్రతిపాదనలతో విజయవాడకు రావాల్సిందిగా చంద్రబాబు వారికి సూచించారు. అన్ని నియోజకవర్గాల్లో త్వరలో ఆత్మీయ సమ్మేళనాలు చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఎల్. రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తదితరులు హాజరయ్యారు.
నెలకోసారైన రండి
సార్వత్రిక ఎన్నికలకు ఇక రెండేళ్ళు ఉంది కాబట్టి కనీసం నెలకోసారైనా తెలంగాణకు వచ్చి తమకు ఒక్క రోజు సమయం ఇస్తే పార్టీ యంత్రాంగంలో కొత్త ఉత్సాహం వస్తుందని వారు చంద్రబాబును కోరారు. తన వీలు చూసుకుని వస్తుంటానని సిఎం చంద్రబాబు వారికి చెప్పారు.