రాష్ట్రీయం

‘వనజీవి’ని పరామర్శించిన సిఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 26: అనారోగ్యానికి గురై ‘కేర్’ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత, వనజీవి రామయ్యను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. సోమవారం చంద్రబాబు పలువురు టి.టిడిపి ముఖ్య నేతలతో కలిసి ‘కేర్’ ఆసుపత్రికి వెళ్ళారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆయనకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయంగా చెక్కును అందజేశారు. ఆసుపత్రి డాక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. పూర్తిగా కోలుకున్నారని, డిశ్చార్జి చేయనున్నట్లు వారు చెప్పారు. ఆర్థిక సహాయం అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు వనజీవి రామయ్య కృతజ్ఞతలు తెలిపారు.

చిత్రం.. హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న పద్మశ్రీ వనజీవి రామయ్యను పరామర్శిస్తున్న ఏపి సిఎం