రాష్ట్రీయం

విశాఖ చెన్నై కారిడార్‌కు 840 మిలియన్ డాలర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 11: విశాఖపట్నం- చెన్నై కారిడార్ అభివృద్ధికి 840 మిలియన్ డాలర్లు ఖర్చవుతుందని ఆసియా అభివృద్ధి బ్యాంక్ కంట్రీ డైరెక్టర్ థెరిస్సాకో వెల్లడించారు. విశాఖలో జరుగుతున్న సిఐఐ భాగస్వామ్య సదస్సులో సోమవారం ఆమె మాట్లాడుతూ ఇందులో ఎడిబి 625 మిలియన్ డాలర్లు రుణంగా ఇస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 215 మిలియన్ డాలర్లు వెచ్చించాల్సి వస్తుందని చెప్పారు. ఈ కారిడార్ అభివృద్ధి చెందితే, వచ్చే 30 ఏళ్లలో 11,600 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని చెప్పారు. ఇదిలా ఉండగా కాకినాడ- విశాఖపట్నం, గన్నవరం- కంకిపాడు, వేర్పేడు- శ్రీకాళహస్తి రహదారులను అభివృద్ధి చేయనున్నామని ఆమె తెలియచేశారు. ఇందుకు ఏడిబి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని ఆమె చెప్పారు.

చిత్రం... భాగస్వామ్య సదస్సులో మాట్లాడుతున్న
ఆసియా అభివృద్ధి బ్యాంకు కంట్రీ డైరెక్టర్ థెరిస్సా కో