రాష్ట్రీయం
శ్రీమంతుడు సినిమా దర్శక, నిర్మాతలపై కోర్టు ఆగ్రహం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, జూన్ 27: శ్రీమంతుడు సినిమా దర్శక నిర్మాతలపై నాంపల్లి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హీరో మహేశ్బాబుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వలేమని కోర్టు పునరుద్ఘాటించింది. మహేశ్బాబుతో పాటు నిర్మాత ఎర్నేని నవీన్కు మరోసారి సమన్లు జారీ చేసింది. ఓ మాసపత్రికకు 2012లో తాను రాసిన ‘చచ్చేంత ప్రేమ’ నవలను కాపీ చేసి శ్రీమంతుడు సినిమా నిర్మించారని, నా అనుమతి లేకుండా నవల ఆధారంగా సినిమా తీయడం కాపీరైట్ ఉల్లంఘనే అవుతుందని ఆర్డి విల్సన్ అలియాస్ శరత్చంద్ర నాంపల్లి కోర్టును ఆశ్రయించడంతో విచారణ ప్రారంభమైంది. ఈ కేసు విచారణలో భాగంగా మహేశ్బాబు కోర్టుకు హాజరు కావాల్సిందేనని, మినహాయింపు ఇవ్వలేమని కోర్టు ఇటీవల ఆదేశించింది. అయినప్పటికీ హైకోర్టు నుంచి గిరిధర్ పేరుతో మహేశ్కు మినహాయింపు తీసుకురావడం చెల్లదని స్పష్టం చేసింది. మరో వైపు దర్శకుడు కొరటాల శివపైనా న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 7కు వాయిదా వేసింది.