రాష్ట్రీయం

జీషాన్ తెలుసు.. కానీ.. డ్రగ్స్‌తో సంబంధం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 24: మాదకద్రవ్యాల కేసులో రోజుకో కొత్తకోణం వెలుగుచూస్తోంది. ఎక్సైజ్ శాఖ సిట్ అధికారులు సినీ నటుడు నవదీప్‌ను సుదీర్ఘంగా విచారించారు. ఈ కేసులో వరుసగా నాలుగు రోజులు సినీ ప్రముఖులను విచారించిన సిట్ అధికారులు ఆదివారం విరామం ఇచ్చారు. ఈకేసులో ఇప్పటికే పూరి జగన్నాథ్, శ్యాం కె నాయుడు, సుబ్బరాజు, తరుణ్‌లను డ్రగ్స్ మాఫియా డాన్ కెల్విన్ కాల్‌డేటా ఆధారంగా విచారించిన సిట్ అధికారులు, సోమవారం విచారణకు హాజరైన నవదీప్‌ను జీషాన్ అలియాస్ జాక్ కాల్ డేటా ఆధారంగా విచారించారు. కాగా నవదీప్ విచారణలో కొత్తగా టింకు పేరు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే అతనెవరూ..ఎప్పటి నుంచి తెలుసు అని సిట్ ప్రశ్నించగా నవదీప్ ఉక్కిరిబిక్కిరయ్యారు. కెల్విన్ ఎవరో తెలియదు..కానీ జీషాన్ అలీ తెలుసని, రెండు నెలల క్రితం ఓ ఫంక్షన్‌లో ఈవెంట్ మేనేజర్‌గా పరిచయమయ్యాడని నవదీప్ అంగీకరించినట్టు విశ్వసనీయ సమాచారం. జీషాన్ తెలిసినప్పటికీ..నాకు డ్రగ్స్‌తో ఎలాంటి సంబంధాలు లేవని, నా ఫోన్ నెంబర్ అతని వద్ద ఉండొచ్చు.. తాను డ్రగ్స్ తీసుకోనని చెప్పినట్టు ఖరాఖండిగా చెప్పినట్టు తెలిసింది. అయితే నవదీప్ రెండేళ్లుగా గచ్చిబౌలిలో పబ్ నిర్వహిస్తున్నాడు. అక్కడ డ్రగ్స్ వినియోగం పెద్ద ఎత్తున జరుగుతోందని సిట్ అధికారులు సేకరించిన ఆధారాలను బట్టి తెలుస్తోంది. దీనిపై నవదీప్‌ను లోతుగా విచారించారు. రక్తం, గోళ్లు, వెంట్రుకలు సేకరించారు. ఇదిలావుండగా నవదీప్ కొత్తరకం మత్తు డ్రింక్‌ను సరఫరా చేస్తన్నట్టు తెలిసింది. ఎల్‌ఎల్‌డి, ఎల్‌ఎండి, గంజాయి వంటి పదార్థాలు కలిపిన కాక్‌టైల్ డ్రింక్ అని..ఈ డ్రింక్ అందరికి అందుబాటులో ఉండదని, ప్రత్యేక వ్యక్తులకు మాత్రమే ఈ డ్రింక్స్ సరఫరా చేస్తున్నట్టు సమాచారం. కాగా నవదీప్ ఇచ్చిన సమాచారం మేరకు సినీ పరిశ్రమకు సంబంధం ఉన్న వారి ఇళ్లల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ప్రముఖ సినీ నటి మేనేజర్ ఇంట్లో గంజాయి నిల్వ ఉన్నట్టు గుర్తించిన పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
నటి కాజల్ మేనేజర్ అరెస్టు
సినీ పరిశ్రమను ప్రకంపనలు సృష్టిస్తోన్న డ్రగ్స్ వ్యవహారంలో రోజుకో కొత్తకోణం వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలువురు సినీ ప్రముఖులను రోజుకొకరిని సిట్ అధికారులు విచారిస్తున్న విషయం విధితమే. తాజాగా ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మేనేజర్ రాన్సన్ జోసెఫ్(రోనీ)ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. రోనీ ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రోనీ ప్రముఖ సినీ తారలు రాశిఖన్నా, లావణ్య త్రిపాఠిలకు కూడా గతంలో మేనేజర్‌గా పనిచేశారు.
డ్రగ్స్ వ్యవహారంలో విచారణ చేపట్టిన విచారణలో భాగంగా మంగళవారం ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను విచారించనున్నట్టు సిట్ అధికారుల తెలిపారు. అయితే ముందుగా సిట్ ప్రకటించిన ప్రకారం హీరో రవితేజను విచారించాల్సి ఉంది. అయితే రవితేజ విచారణపై గోప్యత కొనసాగుతోంది.

చిత్రం.. సోమవారం సిట్ కార్యాలయానికి విచారణ కోసం హాజరైన నటుడు నవదీప్