జాతీయ వార్తలు

రూ. 2 పెరిగిన ఎల్పీజీ ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 1: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికల్లా వంటగ్యాస్‌పై సబ్సిడీని ఎత్తివేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా మంగళవారం సిలిండర్ ధర రెండు రూపాయలు పెరిగింది. తాజా పెంపుదల ప్రకారం ఢిల్లీలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ రేటు రూ.477.46నుంచి రూ.479.77కు పెరుగుతుందని ఐఓసి తెలిపింది. ప్రభు త్వ ఆధీనంలో నడుస్తున్న చమురు కంపెనీలన్నీ కూడా ప్రతినెలా రూ.4 చొప్పున సబ్సిడీ సిలిండర్‌పై రేటును పెంచాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఐ ఓసి నిర్ణయం తీసుకుంది.