రాష్ట్రీయం

చేతబడి అనుమానంతో భార్యాభర్తల హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్కువ, జనవరి 13: చేతబడి అనుమానంతో భార్యాభర్తలను హత్యచేసి మృతదేహాలను కాల్చి బూడిద చేసి వాగులో కలిపేసిన దారుణం బుధవారం విజయనగరం జిల్లాలో వెలుగుచూసింది. మక్కువ మండలం సీబిల్లి పెద్దవలస పంచాయతీ కొత్తకామునివలస గిరిజన గ్రామానికి చెందిన శ్రీను అనే వ్యక్తి వారం క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. గ్రామంలోని గొల్లూరి పండు (40), సీతమ్మ (35) దంపతులు చేతబడి చేసినందునే శ్రీను చనిపోయాడని అతడి బంధువులు అనుమానించారు. అప్పటి నుంచి ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు, ఘర్షణలు జరుగుతున్నాయి. దీనిపై మంగళవారం గ్రామంలో పంచాయతీ జరిగింది. ఇరు వర్గాల మధ్య మొదలైన మాటల యుద్ధం ఘర్షణకు దారి తీయటంతో బుధవారం చర్చిద్దామని పెద్దలు వాయిదా వేశారు. తరువాత తల్లితండ్రులు కనిపించక పోవటంతో వారి కుమార్తెలు సూరమ్మ, రాధ, నర్సి బుధవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన ఎఎస్పీ సిద్ధార్థ్ కౌశిక్, సిఐ రామకృష్ణ, ఎస్‌ఐ ఈశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరపటంతో విషయం వెలుగులోకి వచ్చింది. మంగళవారం సాయంత్రం శ్రీను బంధువులు కొందరు పండు, సీతమ్మలను కొట్టి చంపి, మృతదేహాలను కాల్చి బూడిదచేసేశారు.