రాష్ట్రీయం

48 గంటలు వానలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 12: బిహార్ నుంచి ఒడిశావైపు 1.5 కిమీ ఎత్తున అల్పపీడన ద్రోణి చురుగ్గా కొనసాగుతోంది. ఛత్తీస్‌గడ్ నుంచి తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ మరో ద్రోణి విస్తరించింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు దక్షిణ కర్నాటకలో ప్రభావవంతంగా ఉండటంతో తెలంగాణ, కోస్తాంధ్రలో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శనివారం రాత్రి తెలిపారు. ఈ ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకూ విజయనగరం జిల్లా పూసపాటిరేగలో అత్యధిక వర్షపాతం నమోదైంది. అలాగే శ్రీకాకుళం జిల్లా మందస, విజయనగరం జిల్లా డెంకాడలో 7 సెం.మీ, ఎస్ కోట, పలాస, బాపట్ల, గుడివాడ, నర్సీపట్నంలో 5 సెం.మీ, తిరువూరులో 4 సెం.మీ వర్షపాతం నమోదైంది.