రాష్ట్రీయం

రైల్వే పనులకు 17475 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 18: తెలంగాణ రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం 17475 కోట్లు వెచ్చిస్తోందని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రాజెన్ గొహైన్ పేర్కొన్నారు. ఈమేరకు మంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేస్తూ 2016-17 ఆర్ధిక సంవత్సరానికి పాత పెండింగ్ పనులకు సైతం కేంద్రం 1729 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. గత కాలంతో చూసుకుంటే దాదాపు రెట్టింపు నిధులను రాష్ట్రానికి కేటాయించడం జరిగిందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదన్న మాట తాను అనలేదని మంత్రి రాజెన్ తెలిపారు.