రాష్ట్రీయం

విద్యాసంస్థల్లో కొత్త కొలువులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 31: విద్యాశాఖలో కొత్త పోస్టులు మంజూరయ్యాయి. సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులకు గౌరవ వేతనాలు పెరిగాయి. గత కొనే్నళ్లుగా ఎదురుచూస్తున్న ఎస్‌ఎస్‌ఎ, కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాల బోధన, బోధనేతర ఉద్యోగుల గౌరవ వేతనాలు పెంపునకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆమోదం తెలిపారు. 2008 తర్వాత ప్రారంభించిన 81 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1133 పోస్టుల భర్తీకి సిఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో 2008 నుండి మంజూరు కాని పోస్టుల్లో కొత్త లెక్చరర్ల నియామకానికి మార్గం సుగమం అయింది. 2008 తర్వాత వివిధ దశల్లో 81 జూనియర్ కాలేజీలు ప్రారంభించినా, అక్కడ కావల్సిన బోధన, బోధనేతర పోస్టులు మాత్రం మంజూరు చేయలేదు. దీంతో కాంట్రాక్టు విధానంలో సిబ్బంది పనిచేస్తున్నారు. మరో పక్క 15 ఉర్దూ మీడియం ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కింద నడుసున్న 21 సెక్షన్లకు సంబంధించి 69 జూనియర్ లెక్చరర్ల పోస్టులకు కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ మంజూరు చేశారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల వల్ల విద్యార్థులపై, ఆర్ధిక భారం పడుతోందని గమనించిన ప్రభుత్వం 15 కాలేజీలకు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను తానే నడిపే విధంగా 69 పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపింది. దీంతో విద్యార్థులపై ఆర్ధిక భారం పడకుండానే ప్రభుత్వం ఏటా 1.86 కోట్ల రూపాయలు భరిస్తుంది. అలాగే కాంట్రాక్టు పద్ధతిలో నియమితులైన జూనియర్ లెక్చరర్‌కు 27వేల రూపాయలు వేతనంగా ఇస్తారు.
ఒక వైపు అవసరమైన కొత్త పోస్టులను మంజూరు చేస్తూనే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న పార్టుటైమ్ ఉద్యోగుల వేతనాలను కూడా పెంచిం ది. 63 మంది పార్ట్ టైమ్ జూనియర్ లెక్చరర్ల వేతనాలు రెట్టింపు చేశారు. ప్రస్తుతం ఈ పార్టు టైమ్ జూనియర్ లెక్చరర్‌కు ఒక్కో పీరియడ్‌కు రూ.150లు చెల్లిస్తుండగా, కొత్తగా సీఎం తీసుకున్న నిర్ణయంతో ఈ మొత్తం రూ.300లు పెరిగింది. ఒక్కో పార్టు టైమ్ జూనియర్ లెక్చరర్‌కు నెలకు 72 పీరియడ్‌లు చొప్పున గతంలో రూ.10,800 వేతనం పొందుతుండగా, తాజాగా తీసుకున్న నిర్ణయంతో రూ.21,600లు పెరిగింది. అదే విధంగా 52 మంది పార్టుటైమ్ ల్యాబ్ అటెండెంట్ల వేతనం కూడా 3900 రూపాయిల నుండి 7800 రూపాయిలకు పెంచారు. దీనివల్ల ప్రభుత్వంపై 88.32 లక్షల రూపాయిల అదనపు భారం పడుతుంది.
గౌరవ వేతనాలు పెంపు
సర్వశిక్షా అభియాన్, కస్తూరిభా గాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేస్తున్న 11,839 మందికి గౌరవ వేతనాలు పెంచారు. ఇందులో సర్వ శిక్షా అభియాన్‌కు చెందిన 2690 మంది పార్టుటైమ్ ఇన్‌స్ట్రక్టర్ల గౌరవ వేతనాన్ని 6వేల రూపాయిల నుండి 9వేల రూపాయిలకు , క్లస్టర్ రిసోర్సు పర్సన్స్‌కు 11400 నుండి 15వేల రూపాయిలకు , ఎంఐఎస్ కో-ఆర్డినేటర్లకు 13వేల నుండి 15వేల రూపాయిలకు , డాటా ఎంట్రీ ఆపరేటర్లకు 12వేల నుండి 14వేల రూపాయిలకు పెంచారు. అలాగే మెసెంజర్లకు 8వేల నుండి 8500 రూపాయిలకు, సిస్టమ్ అనలిస్టులకు 15వేల నుండి 16,500 రూపాయిలకు, సీనియర్ ప్రోగ్రాం టెక్నికల్ కన్సల్టెంట్లకు 35వేల నుండి 40వేల రూపాయిలకు, కన్సల్టెంట్లకు 25వేల నుండి 35 వేల రూపాయిలకు, డాటా ప్రాసెసింగ్ ఆఫీసర్లకు 16,500 నుండి 17,500 రూపాయిలకు, డ్రైవర్లకు 13వేల నుండి 15వేలకు , అంటెండర్లకు 10వేల నుండి 12వేలకు వేతనాలు పెంచారు.
కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాల్లో 391 మంది స్పెషల్ ఆఫీసర్ల గౌరవ వేతనాన్ని 21వేల నుండి 25వేలకు, 2737 మంది సిఆర్టీలకు 15వేల నుండి 20వేలకు , 391 మంది అకౌంటెంట్లకు 10వేల నుండి 11వేలకు, 391 మంది ఎఎన్‌ఎంలకు 9వేల నుండి 11వేలకు, 391 మంది పిఇటీలకు 11వేల నుండి 12వేలకు, 782 మంది ఒకేషనల్ 5వేల నుండి 6వేల రూపాయిలకు వేతనాలు పెంచారు.