రాష్ట్రీయం

ఆరుగురు తెలంగాణ టీచర్లకు జాతీయ అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబరు 5: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా తెలంగాణ నుంచి ఆరుగురు అవార్డులును అందుకున్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం నాడు విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన ఉపాధ్యాయులకు ఈ అవార్డులను ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో కేంద్రమానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్, సహాయమంత్రులు సత్యపాల్, ఉపేంద్ర కుష్వాహ కూడా పాల్గొన్నారు. తెలంగాణలోని నిర్మల్ జిల్లా పాత ఎల్లాపూర్‌కి చెందిన వాల్గుట్ కిషన్, నల్లగొండ జిల్లా మర్రిగూడకు చెందిన కుక్కమూడి జనార్థన్, నాగర్‌కర్నూల్ జిల్లా పాల్కపల్లికి చెందిన మహంతి నారాయణ, నిజామాబాద్ జిల్లా కులాస్‌పూర్‌కు చెందిన నునుగొండ విజయలక్ష్మి, ఖమ్మం జిల్లా ఏన్కూరుకు చెందిన పొట్ట రామరావు,మంచిర్యాలకు చెందిన గుండేటి యోగేశ్వర్ అవార్డులను అందుకున్న వారిలో ఉన్నారు. జగిత్యాలకు చెందిన సురేందర్ కూడా ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు రాగా అతను ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు.