రాష్ట్రీయం

జై గణేశా... జై జై గణేశా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జై గణేశా... జై జై గణేశా... నినాదాలతో రాజధాని పురవీధులు పులకించిపోయాయ. పదకొండు రోజుల పాటు నిత్యపూజలు అందుకున్న గణనాథుల నిమజ్జన యాత్ర శోభాయమానంగా సాగింది. నిమజ్జనానికి తరలుతున్న వేలాది గణనాథులను తిలకించేందుకు భక్తజనం పోటెత్తింది. సర్వాంగ సుందరంగా ముస్తాబైన గణనాథులను తనివితీరా తిలకించేందుకు వచ్చిన భక్తులతో ప్రధాన రహదారులన్నీ కిటకిటలాడాయ. ఆబాల గోపాలం అత్యంత ఉత్సాహంతో, భక్తిశ్రద్ధలతో పాల్గొని శోభాయాత్రకు నిండుదనం చేకూర్చారు.