రాష్ట్రీయం

రజాకార్లను మరిపించేలా కెసిఆర్ పాలన:టిడిపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 17: రాష్ట్రంలో కెసిఆర్ పాలన రజాకార్లను మించిపోయిందని టిటిడిపి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బోడ జనార్థన్, టిఎన్‌టియూసి అధ్యక్షుడు బిఎన్ రెడ్డి ఆరోపించారు. విలీన దినోత్సవం ముందు రోజు శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండల పరిధిలో 36 మంది గిరిజనులను, మహిళలను చెట్టుకు కట్టేసి కొట్టి చిత్ర హింసలు పెట్టి, వారి గుడిసెలను అటవీశాఖ అధికారులు కూల్చివేశారని అన్నారు. ఇది రజాకర్ల పాలనను మరిపించే చర్యగా ఉందని, ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు. ఆదివారం నాడిక్కడ వారు విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ దశలో తెలంగాణలో సామాజిక న్యాయం కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని అన్నారు. తా డ్వాయి ఘటనను మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నట్లు జనార్ధన్, రెడ్డి చెప్పారు.