రాష్ట్రీయం

అక్టోబర్‌కల్లా భూ సేకరణ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 21: కాళేశ్వరం ప్రాజెక్టు 15,16 ప్యాకేజిలో భాగంగా కాలువల నిర్మాణం కోసం 8 వేల ఎకరాల భూ సేకరణను వేగవంతం చేయాలని నీటిపారుదవలశాఖ మంత్రి టి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. వచ్చే అక్టోబర్ చివరికల్లా కాలువల కోసం భూ సేకరణ పూర్తి అయ్యాక రిజర్వాయర్ నిర్మాణానికి భూ సేకరణ జరగాలని మంత్రి ఆదేశించారు. కాళేశ్వరం ప్యాకేజి 15,16 పనులపై గురువారం జలసౌధలో మంత్రి హరీశ్‌రావు సమీక్షించారు. ప్యాకేజి 15,16 పనులు పూర్తి అయ్యాక వచ్చే ఏడాది జూన్ వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో చెరువులు నింపాలని మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో యాదాద్రి కలెక్టర్ అనితా రామచంద్రన్, జాయింట్ కలక్టర్ రవినాయక్, భువనగిరి ఎంపి బూర నర్సయ్యగౌడ్. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్‌రెడ్డితో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.