రాష్ట్రీయం
బ్రహ్మాండోత్సవాలు..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 24 September 2017
కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుని వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమలలో శనివారం సాయంత్రం 5.48నుంచి 6 గంటల మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణంతో రంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
సిఎం చంద్రబాబు బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైన గరుడవాహనంలో శ్రీవారు ధరించే పట్టువస్త్రాలను ప్రభుత్వం తరపున సమర్పించారు. కాగా వేదపండితుల వేదఘోష మధ్య వైఖానసాగమోక్తంగా గరుడకేతన ప్రతిష్ట, కంకణ ధారణ, ఆలయ ఆవరణలోను, బయట, చుట్టూ అష్టదిక్కుల్లోనూ బలిని సమర్పిస్తూ స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా ఆలయ పరివార దేవతలతో ఊరేగుతూ ఉండగా అష్టదిక్పాలకులను ఆహ్వానించారు. ఇలా దేవతలను
ఆహ్వానించిన తరువాత స్వామివారు ఆలయంలో ప్రవేశించి ధ్వజస్తంభం వద్దకు చేరుకున్నారు.