రాష్ట్రీయం

తెలుగు కుటుంబాలు సంతోషంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 23: తెలుగువారి కుటుంబాలు ఎక్కడున్నా సంతోషంగా సుఖశాంతులతో ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చం ద్రమోహన్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండల పరిధిలోని రంగారెడ్డిగూడాలోని శ్రీలక్ష్మినారాయణ స్వామి దేవాలయ ప్రాంగాణంలో ప్రముఖ పారిశ్రామికవేత్త జనంపల్లి అనిరుధ్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన శ్రీ్ధన్వంతరి లక్ష్మీసహిత మహా సుదర్శన నారాసింహ యాగం శనివారం భక్తిశ్రద్ధలతో వేదమంత్రోచ్చరణల మధ్య కొనసాగింది. ఈ సందర్భంగా ఎపి, తెలంగాణకు చెందిన పలువురు రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు హాజరై యాగం పూజలో పాల్గొన్నారు. మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, ఏపి వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ భగవంతుడి కన్నా గొప్పవాళ్లు ఎవరూ ఉండరని, ఆ భగవంతుడి దయతోనే కోటిజీవరాశులు నేలపై జీవిస్తున్నాయని, భగవంతుడే ప్రకృతి ద్వారా ఇబ్బందులు సృష్టిస్తారని మనిషిలో మార్పు రావడానికి యజ్ఞాలు, యాగాలు కూడా భగవంతుడే సృష్టించాడని తెలిపారు. వాటిని కలియుగంలో మనిషి రూపంలో ఉండే జీవుడు కోటి జీవరాశుల క్షేమం కోసం యాగాలు చేయాలనే సంకల్పం కూడా భగవంతుడి కృపతో యాగాలు ప్రజలు చేస్తుంటారని అన్నారు.

చిత్రం..యాగంలో పూజలు చేస్తున్న ఏపి మంత్రి సోమిరెడ్డి