రాష్ట్రీయం
ధర్మోని కుంటపై మంట!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జనగామ టౌన్, సెప్టెంబర్ 26: జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మోని (బతుకమ్మ) కుంటలో చేపడుతున్న అభివృద్ధి పనులు వివాదంగా మారుతున్నాయి. పురాతన కాలం నాటి కుంటకు సంబంధించిన విలువైన భూమిని ఆక్రమణకు గురికాకుండా మరమతు చేసి జిల్లా కేంద్రానికి ల్యాండ్మార్క్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తుండగా తనపై అభాండాలు వేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అంటున్నారు. ఇదిలా ఉంటే కుంటలో ఇప్పటివరకు చేసిన పనులన్నీ సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగానే కాకుండా చట్టవిరుద్ధంగా చేపట్టారని కలెక్టర్ శ్రీదేవేసన నిర్మొహమాటంగా చెపుతున్నారు.
ఈ విషయంలో వీరిమధ్య గత కొన్ని రోజులుగా సాగుతున్న విభేదాలు తారస్థాయికి చేరుతున్నాయి. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు సోషల్ మీడియాలో హల్చల్ సృష్టిస్తున్నాయి.
ధర్మోని కుంట అభివృద్ధా..? విధ్వంసమా ?
జనగామ పట్టణ కేంద్రం బస్టాండ్కు కూతవేటు దూరంలో సర్వేనెంబర్- 85లో 9.16 ఎకరాలలో ధర్మోని (బతుకమ్మ) కుంట విస్తీర్ణం ఉండేది. పట్టణం విస్తరించడంతో కొంతమంది రియల్ఎస్టేట్ వ్యాపారు లు కుంట సమీపంలోని ప్లాట్లను విక్రయించడమే కాక కుంట శిఖం భూములను సైతం ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ క్రమంలో 2013లో పట్టణానికి చెందిన కుంట శిఖంలో దుర్గామాత దేవాలయాన్ని ప్రతిష్ఠించారు. అది
తెలుసుకున్న అప్పటి (వరంగల్) జిల్లా జిల్లా జాయంట్ కలెక్టర్ ప్రద్యుమ్న అప్పటి స్థానిక ఆర్డివో హరితను మందలించి శిఖం భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో స్థానికులు దేవాలయాన్ని కుంట శిఖం మూలలో ఉన్న ప్రైవేటు వ్యక్తికి చెందిన ప్లాటులో దేవాలయాన్ని నిర్మించారు. అనంతరం 2014లో తెలంగాణ ప్రభుత్వం ఆవిర్భవించిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆ కుంటను మరమతు పేరుతో మత్తడిని ధ్వంసం చేయించారు. ఎఫ్టిఎల్ పరిధిలో గల 5 ఎకరాల శిఖం భూమిలో మట్టి పోయించారు. కుంట కట్టను మరమతు చేయించి చెరువు చెట్టు ప్రహరీ సైతం నిర్మించారు. పట్టణంలోని వివిధ కుల సంఘాల, వ్యాపారస్తుల ద్వారా వసూళ్లు చేసిన రూ. 30 లక్షలతో ఈ మరమతులు చేయించానని ఎమ్మెల్యే అనేక సందర్భాల్లో వివరించారు. కుంట మరమతు చేసేందుకు, నిధులు మంజూరు చేయించేందుకు స్థానిక అధికారుల ద్వారా తయారు చేయించిన ఎస్టిమేట్ను ప్రద్యున్న అనంతరం జెసిగా వచ్చిన జీవన్ ప్రశాంత్ పాటిల్ వద్దకు తీసుకెళ్లగా కథ అడ్డం తిరిగింది. నిబంధనలకు విరద్ధంగా పనులు చేయిస్తున్నారని జెసి పాటిల్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి వివరిస్తుండగా ఎమ్మెల్యే ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం ఆ రోజుల్లో చర్చనీయాంశంగా మారింది. అనంతరం మిషన్ కాకతీయ ద్వారా రూ. కోటి 10 లక్షల నిధులు తెప్పించి మరమతుకు వినియోగించారు. ఈ పనులు జరుగుతున్న సమయంలోనే 2016 అక్టోబర్ 22న దేవాలయం ట్రస్టు రూపంలో కుంట శిఖంలోని 2000 గజాల భూమి ఎమ్మెల్యే పేరుపై రిజిస్ట్రేషన్ అయింది. ఈ విషయాన్ని కొన్ని రోజుల అనంతరం తెలుసుకున్న ప్రతిపక్షాలు ఆందోళనకు దిగి అధికారులకు వినతిపత్రం సైతం అందచేశారు. కాగా, అసంపూర్తిగా ఉన్న మరమతు పనులను పూర్తి చేసేందుకు రూ. 2.20 కోట్లు నిధులు మంజూరు చేయించాలని ఇటీవలే ఎమ్మెల్యే సమక్షంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు జనగామ కలెక్టర్ శ్రీదేవసేనకు వినతిపత్రం అందజేయగా అందుకు స్పందించిన కలెక్టర్ పనులు నిబంధనలకు విరుద్ధంగా చేపట్టారని విచారణ చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే ముందే స్పష్టం చేశారు. బతుకమ్మ, దసరా ఉత్సవాలను అదే కుంటలో నిర్వహించాలని ఎమ్మెల్యే కోరగా అందుకు కలెక్టర్ అంగీకరించలేదు. దీంతో ఎమ్మెల్యే తమ ఆవేశాన్ని దిగమింగుకొని కలెక్టర్ కార్యాలయం నుండి వెనుదిరిగి వెళ్లిపోయారు. సోమవారం డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి జనగామకు వచ్చిన సందర్భంగా ముత్తిరెడ్డి ఆయనను బతుకమ్మ కుంటకు తీసుకొని వెళ్లి సమస్యను వివరించారు. వారి వెంట వెళ్లిన కలెక్టర్ శ్రీదేవసేన గతంలో జరిగిన విషయాన్ని ఉపముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి వాస్తవ విషయాలు తెలుసుకుందామని వెళ్లిపోయారు. అనంతరం కలెక్టర్ శ్రీదేవసేన మీడియాతో మాట్లాడుతూ కుంట శిఖం భూముల్లో మరమతు చేసేందుకు అదేశాలు ఇచ్చే అధికారం తమ పరిధిలో లేదని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కొన్ని రోజుల కిందట ట్రస్టు పేరుతో శిఖం భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తమకు పలువురి నుండి ఫిర్యాదు అందగానే అందుకు స్పందించి సంబంధిత అధికారులో చర్చించి రిజిస్ట్రేషన్ రద్దు చేయించిన విషయం వాస్తవమని అన్నారు. అంతేకాక కుంట శిఖం భూమిలో నిర్మాణాలు చేయించడమే కాక మరికొంతమంది ఆక్రమించుకున్నట్లు తెలుస్తోందని అన్నారు. విరాళాల రూపంలో రూ. 30 లక్షలు వసూలు చేసినట్లు వాకర్స్ అసోసియేషన్ తమకు ఎమ్మెల్యే సమక్షంలోనే రాతపూర్వకంగా ఇచ్చారని, అందులో ఖర్చుల వివరాలు లేవన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యే సంతకం కూడా లేదని తెలిపారు. నిబంధనలకు వ్యతిరేకంగా చేసిన పనులకు తాను సహకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు జరిగిన పనులపై విచారణ జరిపించి ఎన్ని నిధులు కావాలో ఉన్నతాధికారులతో చర్చించి కృషి చేస్తానని అన్నారు. అంతేకాని ఈ విషయంలో రాద్ధాంతం చేసి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ప్రచారం చేయడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు.
చిత్రం.. ఎఫ్టిఎల్ను పూడ్చివేసిన శిఖం భూమి