రాష్ట్రీయం

నింగిలోకి దూసుకెళ్లిన పిఎస్‌ఎల్‌వి సి-31

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు: శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ నుంచి బుధవారం ఉదయం సరిగ్గా 9.31 గంటలకు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సి-31 (పిఎస్‌ఎల్‌వి) వాహక నౌకను ఇస్రో శాస్తవ్రేత్తలు నింగిలోకి విజయవంతంగా పంపారు. ఈ ఏడాది ఇస్రో సాధించిన ఘన విజయం ఇది అని శాస్తవ్రేత్తలు అభివర్ణించారు. మరో రెండు నెలల్లో రెండు ఉపగ్రహాలను ప్రయోగిస్తామని, ఈ ఏడాది అంతానికి స్వదేశీ దిక్సూచిని అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నిస్తామని వారు తెలిపారు. భూస్థిర కక్ష్యకు 36వేల కి.మీ.ల ఎత్తున తాజా ఉపగ్రహాన్ని రోదసిలో నిలిపారు.