రాష్ట్రీయం

హుదూద్ నేర్పిన పాఠంతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 6: ప్రతిష్టాత్మకమైన, ఏపీలోనే తొలి భారీ ప్రాజెక్టుగా చెప్పుకునే భూగర్భ విద్యుద్దీకరణ ప్రాజెక్ట్ పనులకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 9న మధ్యాహ్నం 12.10 గంటలకు విశాఖ నగరంలో పాండురంగాపురం 33/11కెవి విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద ప్రాజెక్టు నిర్మాణ పనులకు సిఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారు. ఆసియా ఖండంలోనే అతి పెద్ద పారిశ్రామికవాడగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో భూగర్భ విద్యుద్దీకరణ ఆవశ్యకతను కొనే్నళ్ళ కిందటే ప్రభుత్వం, ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిఎల్) గుర్తించింది. అయితే 2014 అక్టోబర్ 12న ఇక్కడ సంభవించిన హుదూద్ తుపాను ఓ గుణపాఠం నేర్పింది. దీంతో అప్రమత్తమైన సంస్థ తక్షణ కర్తవ్యాన్ని చేపట్టింది. విశాఖ వంటి మహానగరంలో హుదూద్ వంటి భారీ తుపాన్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, పర్యావరణ పరిరక్షణ, విద్యుత్ స్తంభాలు, పిచ్చుకగూళ్ళ మాదిరిగా ఉండే విద్యుత్ తీగలతో ఎదురయ్యే ప్రమాదాలను నివారించేందుకు భూగర్భ విద్యుద్దీకరణ తప్పనిసరిగా భావించి ప్రణాళికలు రూపొందించింది. వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం, తరువాత ప్రపంచ బ్యాంకుకు సిఫారసు చేయడం, దీనికి సంబంధించిన బృందం ఈపిడిసిఎల్ ఆధ్వర్యంలో అధ్యయనం చేయడం వేగంగా జరిగిపోయాయి. నగరంలో నాలుగు ప్యాకేజీల కింద 276 కిలోమీటర్ల మార్గంలో ఈ భారీ ప్రాజెక్టును నిర్మించేందుకు రూ.760 కోట్లకు పైగానే ఖర్చవుతుందని అంచనాతో ప్రతిపాదనలు పంపడం, దీనికి ఆమోదం తెలిపింది. దీని తరువాత ఉన్నతాధికారుల బృందం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కోల్‌కతాకు వెళ్ళి శిక్షణ పోందడం, నిధులు మంజూరైన తరువాత తొలి మూడు ప్యాకేజీల ప్రాజెక్టుకుగాను టెండర్లు ఖరారు చేయడం కూడా పూర్తయ్యింది. వీటన్నింటికీ చెంనిన కార్యక్రమాలు పూర్తిచేయడానికి ఏకంగా మూడేళ్ళకాలం పట్టింది. మొత్తం మీద ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులకు ఈనెల 9న సిఎం శంకుస్థాపన చేస్తారు.
18 మాసాల్లో పూర్తి
విశాఖ నగరంలోని 276 కిలోమీటర్ల మార్గంలో మూడు ప్యాకేజీల్లో నిర్మించే ఈ ప్రాజెక్టు కోసం రూ.760 కోట్ల మేర ఖర్చవుతుందని ఈపిడిసిఎల్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ హెచ్‌వై దొర ‘ఆంధ్రభూమి’కి తెలిపారు. తొలి ప్యాకేజీలో ఎంవిపి కాలనీ, పెదవాల్తేరు, కెజిహెచ్, ఆర్‌సిడి ఆసుపత్రి, సిరిపురం, శివాజీపార్కు ప్రాంతాల్లో భూగర్భ విద్యుద్దీకరణ నిర్వహించగా, ప్యాకేజీ-2లో భాగంగా పాండురంగాపురం, ఆర్‌కె బీచ్, రామ్‌నగర్, విద్యుత్‌శాఖ, టిఎస్‌ఆర్ కాంప్లెక్స్, దొండపర్తి ఇండోర్, సిఎంఆర్ ఇండోర్, మద్దిలపాలెం ప్రాంతాలున్నట్టు ఆయన పేర్కొన్నారు. వీటితోపాట ప్యాకేజి-3లో కొత్తరోడ్డు, పోర్టు, పోలీసుబ్యారెక్స్, ఔటర్‌హార్బర్, వెంకటేశ్వరమెట్ట, చిత్రాలయ, కీస్ (సరస్వతిపార్కు)ల్లో దీని నిర్మాణం జరుగనుందన్నారు. ఈ విధంగా కేవలం 18 మాసాల్లో ప్రాజెక్టు నిర్మాణం పూర్తకానుందన్నారు. ఇది అందుబాటులోకి వస్తే ప్రకృతి వైపరీత్యాలు, హుదూద్ వంటి తుపాన్లను సమర్ధవంతంగా ఎదుర్కోవడం, విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణకు కోట్లాది రూపాయల మేర వెచ్చించాల్సిన అవసరం ఉండదన్నారు. అన్నింటికంటే ప్రధానంగా ప్రజల ఆస్తులను కాపాడినట్టు అవుతుందని, విద్యుత్ సరఫరాలో అంతరాయాలను అధిగమించడం, ప్రత్యామ్నాయం ఏర్పాట్లు కోసం ఇబ్బందులు పడే పరిస్థితులుండవన్నారు. అలాగే విశాఖ నగరాన్ని స్మార్ట్‌సిటీగా ప్రకటించినందున ఆర్థిక వృద్ధికి ఈ ప్రాజెక్టు ఎంతో తోడ్పడుతుందన్నారు.

చిత్రం..ఈపిడిసిఎల్ చైర్మన్ హెచ్‌వై దొర