రాష్ట్రీయం
అనంతలో డెంగ్యూ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 8 October 2017
అనంతపురం, అక్టోబర్ 7 : అనంతపురం జిల్లా డి.హీరేహాల్ మండల పరిధిలోని మడినేహళ్లి గ్రామంలో శనివారం డెంగ్యూ లక్షణాలతో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మడినేహళ్లి గ్రామంలో గత వారం రోజుల నుంచి విషజ్వరాలు ప్రబలాయి. అందులో డెంగ్యూ లక్షణాలతో గొడవలద వన్నూరప్ప (55), ఓబుళస్వామి (7), నవీన్ (9నెలలు), పరశురాం (ఏడాది), నరసింహ, హనుమంతు, ఉర్తాల్ వన్నూరప్ప మూడు రోజుల క్రితం కర్నాటకలోని బళ్లారి విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో శనివారం గొడవలద వన్నూరప్ప, ఓబుళస్వామి, నవీన్, పరశురాం మృతి చెందారు. ఇక నరసింహ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బెంగళూరు ఆసుపత్రికి తరలించారు.